అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్పై యుద్ధం ఆపకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు అలాస్కాలోని యాంకరేజ్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందు వెలువడ్డాయి. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని రేపింది.శిఖరాగ్ర సమావేశం తర్వాత కూడా యుద్ధం కొనసాగితే, రష్యా ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అని ట్రంప్ హెచ్చరించారు.అమెరికా పక్షాన చర్చలు సాగినా, ఉక్రెయిన్ మీద దాడులు ఆగకపోతే పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందని ఆయన అన్నారు.బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో, ట్రంప్ స్పష్టమైన వైఖరి చూపినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ తెలిపారు.ట్రంప్ మాట్లాడుతూ, “తక్షణ కాల్పుల విరమణే మా ప్రాధాన్యత” అని పేర్కొన్నారని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగాలపై నిర్ణయం తీసుకునే హక్కు అక్కడి అధ్యక్షుడిదే అని ట్రంప్ హామీ ఇచ్చారని తెలిపారు.

త్రైపాక్షిక సమావేశం ఆలోచనపై ఆసక్తి
భవిష్యత్తులో ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని మెక్రాన్ వెల్లడించారు. దీని ద్వారా స్థిరమైన శాంతి చర్చలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ సమావేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.పుతిన్ నాటకమే ఆడుతున్నారని, అమెరికాను ఒత్తిడిలో పెట్టేందుకే సరిహద్దుల్లో దాడులు పెంచారని విమర్శించారు.ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించగలమని రష్యా చూపించాలనుకుంటోందని జెలెన్స్కీ ఆరోపించారు. అంతేకాదు, ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని స్పష్టం చేశారు.
భూభాగం లొత్తివ్వం: జెలెన్స్కీ స్పష్టం
తమ దేశ భూభాగం ఒక్క అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమ భద్రతకు, స్వతంత్రతకు రాజీ పడేది లేదని చెప్పారు.ఐరోపా దేశాల ఆందోళన పెరుగుతోంది.ఈ చర్చల నుండి తమను పక్కన పెట్టడం పట్ల యూరప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, యూరప్-ఉక్రెయిన్ భద్రతపై చర్చించారని సమాచారం.ప్రస్తుతం రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.ఈ పట్టణం పరాజయం అయితే, రష్యాకు వ్యూహాత్మక విజయం లభించే అవకాశం ఉంది అని సైనిక నిపుణులు చెబుతున్నారు.
Read Also :