అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వలస విధానాల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ (Trump) యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికా వీసా పొందడం, ఉన్న వీసాను కాపాడుకోవడం అత్యంత కఠినంగా మారింది.
Read Also: Trump: మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా అమెరికా విదేశాంగ శాఖ (US Department of State) ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ మరియు సెక్రటరీ రూబియో తీసుకున్న సాధారణ ఆదేశాలకు కట్టుబడి ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఈ ప్రక్రియను ఇప్పుడే నిలిపివేసే ఉద్దేశం తమకు లేదని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.
ఈ పోస్టుకు ట్రంప్ ఫోటోను జతచేస్తూ, దానిపై ‘మేక్ అమెరికా సేఫ్ ఏగైన్’ అనే నినాదాన్ని ఉంచడం ద్వారా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని అమెరికా ప్రభుత్వం తేల్చిచెప్పింది.
విద్యార్థులే ప్రధాన లక్ష్యం: కారణాలు ఇవే
వీసాలు రద్దయిన వారిలో గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. రద్దయిన మొత్తం వీసాల్లో 8 వేలకు పైగా స్టూడెంట్ వీసాలు ఉన్నాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అని స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడపడం (DUI), దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వారి వీసాలను ప్రధానంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాంటి చర్యలు స్థానిక ప్రజలకు ముప్పుగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి తోడు, అమెరికాలోని పలు క్యాంపస్లలో గాజాకు మద్దతుగా నిరసనలు తెలిపిన విదేశీ విద్యార్థులను కూడా ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని ఉగ్రవాద గ్రూపులకు మద్దతుదారులుగా ఆరోపిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
విస్తరించిన వెట్టింగ్ పాలసీ మరియు ప్రయాణ ఆంక్షలు
అమెరికాలో నివసిస్తున్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలపై వెట్టింగ్ పాలసీని (నిఘా మరియు తనిఖీ విధానం) ప్రభుత్వం మరింత విస్తరించింది. వీసాదారులకు సంబంధించి ఏ చిన్న వ్యతిరేక సమాచారం లభించినా వెంటనే వారి వీసాలను రద్దు చేస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్లో ఇద్దరు నేషనల్ గార్డు సభ్యులపై ఓ అఫ్గానిస్థాన్ జాతీయుడు కాల్పులు జరిపిన ఘటన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే 19 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించిన ట్రంప్ యంత్రాంగం, ఈ జాబితాను 30 నుంచి 32 దేశాలకు విస్తరించాలని యోచిస్తోంది. దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: