మరిన్ని సుంకాలు వేస్తామంటే కొత్త మార్కెట్లను వెతుక్కుంటామని హెచ్చరిక
అమెరికా – భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరికీ తలొగ్గదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ అనేక వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందని అన్నారు.
Read Also: Trump: వెస్ట్ బ్యాంక్ విషయంలో ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరిక

వాణిజ్య ఒప్పందాలకు భారత్ కట్టుబడి వుంది
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో, 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో మార్పు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని, ఇతర దేశాలతో విశ్వసనీయ సంబంధాల ను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. భారత్ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని, కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు.
పియూష్ గోయల్ ఎవరు?
పియూష్ వేదప్రకాష్ గోయల్ (జననం 13 జూన్ 1964) భారత ప్రభుత్వంలో ఒక రాజకీయ నాయకుడు మరియు క్యాబినెట్ మంత్రి, వస్త్ర శాఖ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి వంటి శాఖలను కలిగి ఉన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: