Telugu News: trade war:సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: నౌకలపై ప్రత్యేక ఛార్జీ

Read Time:  1 min
trade war:సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: నౌకలపై ప్రత్యేక ఛార్జీ
trade war:సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: నౌకలపై ప్రత్యేక ఛార్జీ
FONT SIZE
GET APP

అమెరికా(America) – చైనా మధ్య వాణిజ్య యుద్ధం(trade war) మరింత ముదురుతోంది. తాజాగా, ఇరుదేశాలు నౌకలపై పరస్పరం ప్రత్యేక ఫీజులను ప్రకటించాయి. అమెరికా యాజమాన్యంలోని నౌకలు, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. అయితే, చైనాలో నిర్మించిన నౌకలకు మాత్రం ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజును వసూలు చేస్తోంది.

Read Also:  FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు

trade war

చైనా స్పందన: ‘యుద్ధం కోరుకుంటే చివరి వరకు పోరాడతాం’

అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల(Tariffs) అంశంపై తమ వైఖరి స్థిరంగా ఉందని, అమెరికా ఈ తరహా యుద్ధం కోరుకుంటే తాము చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఒకవేళ చర్చలు జరపడానికి సిద్ధమైతే, అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు.

చైనా ఏ రకం నౌకలపై ప్రత్యేక ఛార్జీ విధించింది?

అమెరికా యాజమాన్యంలోని, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ఛార్జీ విధించింది.

ఈ కొత్త ఛార్జీ నుంచి ఏ నౌకలకు మినహాయింపు లభిస్తుంది?

చైనాలో నిర్మించిన నౌకలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.