Thai princess Rajasthan tour : థాయ్లాండ్ యువరాణి Princess Sirivannavari Nariratana నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం రాజస్థాన్కు చేరుకున్నారు. శుక్రవారం ఆమె ప్రత్యేక విమానంలో Jaipur అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, ఫిబ్రవరి 10 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా జైపూర్, జోధ్పూర్లలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను ఆమె సందర్శించనున్నారు.
యువరాణి రాక సందర్భంగా విమానాశ్రయంలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. దౌత్య నిబంధనల మేరకు ఫోటోలు, వీడియోలపై పరిమితులు విధించారు. విమానాశ్రయం నుంచి ఆమె ప్రత్యేక కాన్వాయ్లో రామ్బాగ్ ప్యాలెస్ హోటల్కు చేరుకోగా, జైపూర్ పర్యటనంతా అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సంప్రదాయ అతిథి సత్కారాన్ని ఆమెకు పరిచయం చేశారు.
Read Also: AP: కొత్త రైల్వే లైన్ కి రూ. 713.33 కోట్లు మంజూరు

పర్యటనలో భాగంగా ఆమె జైపూర్లోని అమెర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్, త్రిపోలియా బజార్లను సందర్శించనున్నారు. అనంతరం Jodhpur కు వెళ్లి మెహ్రాన్గఢ్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనతో భారత్–థాయ్లాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు పేర్కొన్నారు.
యువరాణి నారీరతన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫ్యాషన్ డిజైనర్గా కూడా ప్రసిద్ధి చెందారు. ఆమెకు సొంతంగా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. అదేవిధంగా థాయ్ రాయల్ ఆర్మీలో మేజర్గా సేవలందిస్తున్నారు. ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్, ప్రోటోకాల్ అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: