ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ (TG) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.తరలి రండి – ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి అనే నినాదంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈవెంట్ను హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు రానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యూఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, గ్లోబల్ స్థాయి సీఈవోలు హాజరుకానున్నారు. తెలంగాణ అభివృద్ధి దిశ, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ సదస్సు రూపొందించారు.
Read also: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ఈ రెండు(TG) రోజుల సమ్మిట్లో భాగంగా, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ పథక దిశానిర్దేశక పత్రాన్ని విడుదల చేయనున్నారు. టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొనడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.
ఈ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరి, హెచ్డీ కుమారస్వామి వంటి పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఎక్స్ప్రెస్ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణ వంటి కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతిపత్రాలు కూడా ఈ సందర్శనలో ప్రధానికి అందించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: