📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Terror Attack : ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

Author Icon By sumalatha chinthakayala
Updated: April 23, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Terror Attack : జమ్మూలోని పహల్గాంలో దుర్మార్గంగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్‌ ఫౌజి, సులేమాన్‌ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్‌, ఆసీఫ్‌ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. వీరందరూ జమ్మూకశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర వేట

టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. దీంతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర వేట తీవ్రమైంది. దీంతోపాటు ఓ ఉగ్రవాది ఆటోమేటిక్‌ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో పహల్గాం దాడి మొదలైంది. ముష్కరులు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటిని హెల్మెట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఉగ్రవాదులు ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు.

కాశ్మీర్ లో పుల్వామా దాడి తర్వాత అత్యంత ఘోరమైన దాడి

అనంతరం హత్య చేశారు. కొందరిని స్నైపర్‌ వంటి టెక్నిక్స్‌ వాడి దూరం నుంచే కాల్చారు. 2019 లో పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. ఆరుగురు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారు జామున దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరి ఫొటో ఆన్ లైన్ కూడా కనిపించింది. ఈ ఫొటోలో ఉగ్రవాది AK47 రైఫిల్ పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, తొలుత నిఘా వర్గాలు ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు.

Read Also: భారత్ ఉగ్రదాడిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటుంది : ఎంపీ ఈటల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.