📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Himanta Biswa Sarma: అసోంలో ఉద్రిక్తతలు: ధుబ్రిలో ‘కాళ్చివేత ఉత్తర్వులు’ !

Author Icon By Shobha Rani
Updated: June 14, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూన్ 9న ధుబ్రి పట్టణంలోని హనుమాన్ ఆలయం సమీపంలో మాంసం ముక్కలు కనిపించడంతో హిందూ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై వెంటనే అధికారులు జూన్ 10న నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, మత ఘర్షణలు సృష్టించేందుకు ఒక “మతపరమైన బృందం” ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తీవ్రంగా హెచ్చరించారు. ధుబ్రి జిల్లాలో రాత్రి సమయాల్లో కనిపిస్తే కాల్చివేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సంచలన ప్రకటన చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ధుబ్రిలో పర్యటించారు.
ధుబ్రిలో అశాంతి చెలరేగిన నేపథ్యం
కొన్ని రోజులుగా ధుబ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 9న ధుబ్రి పట్టణంలోని ఓ ఆలయం సమీపంలో మాంసం ముక్కలు కనపడటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు 10న పట్టణంలో నిషేధాజ్ఞలు విధించి, మరుసటి రోజు మంగళవారం, జూన్ 11న వాటిని ఉపసంహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధుబ్రికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు.
హిమంత బిశ్వ శర్మ ఘాటు స్పందన
అనంతరం ఆయన (Himanta Biswa Sarma) మాట్లాడుతూ “ఈరోజు నేను గౌహతికి చేరుకున్న వెంటనే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేస్తాం. రాత్రిపూట ఎవరైనా బయట తిరిగినా లేదా రాళ్లు రువ్వినా వారిని అరెస్టు చేస్తారు” అని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని, ధుబ్రిలోని నేరస్థులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. “చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా పరిగణిస్తాం” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Himanta Biswa Sarma: అసోంలో ఉద్రిక్తతలు: ధుబ్రిలో ‘కాళ్చివేత ఉత్తర్వులు’ !

వారం రోజులుగా ధుబ్రిలో శాంతిభద్రతల పరిస్థితి సవాలుగా మారిందని ఆయన అంగీకరించారు. జూన్ 7న జరిగిన బక్రీద్ పండుగ మరుసటి రోజు అంటే జూన్ 8న జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం ముందు గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆవు తలను ఉంచారని, ఈ ఘటనపై హిందూ, ముస్లిం వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారని ముఖ్యమంత్రి (Himanta Biswa Sarma) గుర్తుచేశారు. అయితే, ఆ మరుసటి రోజు మళ్లీ అదే ఆలయం ముందు ఆవు తలను ఉంచడమే కాకుండా, రాత్రి సమయంలో రాళ్లు కూడా రువ్వారని ఆయన వివరించారు.
మతతత్వ బృందాల కుట్రల ఆరోపణలు
“ఒక మతపరమైన బృందం ధుబ్రిలో అశాంతిని సృష్టించడానికి చురుకుగా పనిచేస్తోందని నాకు సమాచారం అందింది. అందుకే నేను ధుబ్రికి వచ్చాను. జిల్లాలో రాత్రిపూట కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయి” అని శర్మ (Himanta Biswa Sarma) పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, బక్రీద్‌కు ఒక రోజు ముందు, జూన్ 6న, ‘నబిన్ బంగ్లా’ అనే సంస్థ ధుబ్రిని బంగ్లాదేశ్‌లో విలీనం చేయాలనే లక్ష్యంతో రెచ్చగొట్టే పోస్టర్లను ప్రదర్శించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
ప్రజలకు ముఖ్యమంత్రి సందేశం
వచ్చే ఏడాది ఈద్ రోజున తానే స్వయంగా ధుబ్రికి వస్తానని, మరుసటి రోజు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. “ఒక వర్గం వారు ఇలాంటి అలజడులు సృష్టించడాన్ని మా ప్రభుత్వం అనుమతించదు. దీన్ని మేం సహించం. ధుబ్రి జిల్లా మా చేతుల్లోంచి జారిపోవడానికి మేం ఒప్పుకోం” అని పేర్కొన్నారు. విభేదాలు, ప్రోద్బలాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు శర్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాలనలో చట్టాన్ని అతిక్రమించే ఎలాంటి చర్యలు సహించబోమని చెప్పారు

Read Also: London Hindu Attack: లండన్‌లో హిందూ యువకులపై దాడి

'Evacuation orders' issued in Dhubri! Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Tensions in Assam: Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.