సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత .. ఎంపిలకు గాయాలు

Read Time:  1 min
Tension in Serbian parliament.. MPs injured
Tension in Serbian parliament.. MPs injured
FONT SIZE
GET APP

బెల్గ్రేడ్: సభలో పొగ బాంబులు విసరడంతో మంగళవారం సెర్బియా పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ముగ్గురు పార్లమెంట్‌ సభ్యులు గాయపడగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వ విద్యాలయ విద్యకు నిధుల పెంపునకు ఉద్దేశించిన చట్టంపై ఓటింగ్‌ జరగాల్సి వుంది. ఈ సమావేశమే చట్ట విరుద్ధమైనదని వాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ముందుగా ప్రధాని మిలోస్‌ వుసెవిక్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. సమావేశం ప్రారంభమైన గంట తర్వాత పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. సెర్బియా ఎదుగుతోంది. పాలన క్షీణిస్తోంది అని రాసి వున్న బ్యానర్‌ను చేబూని, ఈలలు ఊదుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు.

సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత ఎంపిలకు

పొగబాంబులు విసరడంతో ముగ్గురు ఎంపిలకు గాయాలు

దీంతో ఎంపీల మధ్య తొలుత ఘర్షణ మొదలైంది. ఆ వెంటనే పొగ బాంబులు విసురుకున్నారని బయటకు వచ్చిన వీడియోలను బట్టి తెలుస్తోంది. గుడ్లు, నీళ్ళ సీసాలను కూడా ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రతిపక్షం తీవ్రవాదుల్లా వ్యవహరిస్తోందని పార్లమెంట్‌ స్పీకర్‌ అనా బ్రనబిక్‌ విమర్శించారు. ఈ సంఘటనతో దేశంలో రాజకీయ సంక్షోభం ఎంతలా నెలకొందో స్పష్టమవుతోంది. నెలల తరబడి కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక నిరసనలతో ప్రభుత్వం అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని వుసెవిక్‌ తన పదవికి జనవరిలో రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఇంకా దాన్ని ఆమోదించాల్సి వుంది.

విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం

కాగా, సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబర్‌లో ఓ రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మృతి చెందారు. అప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాలకు చెందిన వారు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధాన మంత్రి మిలోస్ పుచెవిచ్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి రాజీనామాను 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించడమా అనేది తేల్చాల్సి ఉంది. అయితే పార్లమెంటులో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోపక్క పార్లమెంటులో యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.