📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump-ట్రంప్ టారిఫ్ పై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

Author Icon By Pooja
Updated: August 26, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump: అమెరికా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) స్పందించారు. ముంబైలో జరిగిన FICCI-IBA వార్షిక బ్యాంకింగ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, అధిక సుంకాలు భారత ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అవసరమైతే RBI ముందుకు వచ్చి ఆర్థిక వృద్ధిని, ప్రభావిత రంగాలను ఆదుకునే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఆర్బీఐ తీసుకున్న మద్దతు చర్యలు

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత కొరత లేదని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవడానికి RBI సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు, కార్పొరేట్లు కలిసి పనిచేయాలని మల్హోత్రా పిలుపునిచ్చారు. త్వరలోనే బాసెల్‌-3 నిబంధనలు(Basel III regulations) అమల్లోకి వస్తాయని, చిన్న వ్యాపారులకు రుణ సాయం మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మల్హోత్రా ప్రకారం, మొత్తం భారత ఎగుమతుల్లో 45 శాతం టారిఫ్‌లకు బయట ఉన్నాయి. మిగిలిన 55 శాతం వస్తువులు మాత్రమే అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, MSMEలు, పాదరక్షల రంగం వంటి కార్మిక ఆధారిత పరిశ్రమలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఈ రంగాల ప్రతినిధులు, ఎగుమతి మండలులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

అదే సమయంలో, పరిశ్రమలకు ఇచ్చే రుణాల వృద్ధి 5.49% వరకు తగ్గిందని RBI డేటా చూపిస్తోంది. ఇది ప్రైవేట్ పెట్టుబడుల మందగమనాన్ని ప్రతిబింబిస్తోందని మల్హోత్రా అన్నారు. అధిక సుంకాల ప్రభావం వల్ల భారత GDP వృద్ధి 0.6% పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు RBI ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి, ప్రభావిత రంగాలకు రుణప్రవాహాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు.

RBI తీసుకున్న ముఖ్య చర్యలు ఏమిటి?

RBI ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి, ప్రభావిత రంగాలకు రుణప్రవాహం కొనసాగించేలా చర్యలు తీసుకుంది.

భారత GDPపై ఎంత ప్రభావం ఉంటుందని అంచనా?

RBI అంచనా ప్రకారం, అధిక సుంకాల కారణంగా భారత GDP వృద్ధి 0.6% పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/transparency-in-distribution-of-ration-goods-with-smart-cards/andhra-pradesh/536437/

Breaking News in Telugu Google News in Telugu India exports tariff impact Latest News in Telugu RBI on US tariffs Sanjay Malhotra RBI Trump tariff India effect US-India trade relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.