Modi: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం(War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఆగిపోవాలని ఎన్నో దేశాలు కోరుతున్నాయి. ఉక్రెయిన్లోని పలు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిను ఇంకా దాహం తీరడం లేదు. యుద్ధం ఆపేది లేదని చెబుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపేందుకు దఫాలుగా మీటింగ్ లనుఏర్పాటు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్కు రావాలని ప్రధాని మోడీ ఆహ్వానించారు. భారత్లో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్బుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘భారత్ కు జెలెన్స్కీ రాకకోసం ఇరుదేశాల అధికారులు పనిచేస్తున్నారు. భారత్కు ఆయన వస్తారని ఆశిస్తున్నాం’ అని పొలిష్బుక్ అన్నారు.
యుద్ధం ముగింపుకు భారత్ సాయం కావాలి
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక గొప్ప కార్యచరణ కానుంది. ఆయన వచ్చేందుకు సరైన తేదీన అంగీకరించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధాన్ని ముగించడంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించాలి. భారత్ కు రష్యాతో సుదీర్ఘకాలంగా బంధం ఉంది. అందుకే మేం శాంతి చర్చల్లో భారతు కీలక పాత్రధారిగా భావిస్తున్నాం. ప్రధాని వమోదీ శాంతి, కాల్పుల విరమణను సమర్థిస్తున్నారు. భారత్ శాంతి, దౌత్యం, రాజకీయ చర్చలను దృఢంగా సమర్థిస్తోందని’ అలెగ్జాండర్ పొలిష్బుక్ తెలిపారు.
పెద్దన్న పాత్రలో మోదీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ బాటలోనే ప్రధాని మోదీ(Modi) నడుస్తున్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధం ముగించుకోవాలని ఇప్పటికే చాలాసార్లు మోదీ సూచించారు. ఇప్పుడు జెలెన్స్కీని భారత్కు రావాలని ఆహ్వానించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచారు. మరోవైపు త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారతకు రానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంచలనం రేపుతున్న తరుణంలో ఇరుదేశాధినేతలు భారత్ కు రానుండడంతో మోదీ ప్రపంచ దృష్టిని ఆకరి ున్నారు. రష్యాతో భారత్కు చాలా దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ తో కూడా భారతదేశం బలమైన దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. దీంతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి గొప్ప అవకాశం ఇవ్వనున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. ఏ దేశం వైపు మొగ్గు చూపకుండా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. ఈ తటస్థ వైఖరితో ఉండటం వల్ల పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ వమోదీ అభిప్రాయాలను వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనా మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ అధికంగా నష్టపోయింది. రష్యా ఉక్రెయిన్ లోని అధిక భాగాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. రెండు దేశాలకు చెందిన సైనికులు అనేకులు మరణించారు. ఆర్థికంగా రెండుదేశాలు దెబ్బతింటున్నాయి. సొంత దేశస్తులే పుతిన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ కు ఎందుకు రానున్నారు?
జవాబు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి భారత్ కీలక పాత్ర పోషించాలని భావించి, శాంతి చర్చల కోసం జెలెన్స్కీ భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
జెలెన్స్కీని భారత్ కు ఎవరు ఆహ్వానించారు?
భారత ప్రధాని నరేంద్ర మోదీ జెలెన్స్కీని ఆహ్వానించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :