Tehran: టెహ్రాన్ ను వీడుతున్న ప్రజలు..ఏటీఎంలపై ఆంక్షలు

Read Time:  1 min
Tehran: టెహ్రాన్ ను వీడుతున్న ప్రజలు..ఏటీఎంలపై ఆంక్షలు
FONT SIZE
GET APP

టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో (Tehran) ప్రస్తుతం అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ (Israel) మరిన్ని వైమానిక దాడులకు పాల్పడవచ్చన్న భయంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

నగర విడిచే ప్రయత్నంలో ప్రజల తరలింపు

టెహ్రాన్ నగరాన్ని వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలైన గ్రామీణ ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాభా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో నగరం నుంచి ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం తీరానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. సురక్షితమైన ఆశ్రయం కోసం ప్రజలు పడుతున్న ఆరాటం టెహ్రాన్ లోని నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తం మీద, ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడుల భయంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది.

ఇంధన రేషన్ విధానం – ఆర్థిక ఆంక్షలు ప్రారంభం

ప్రభుత్వం ప్రజల తరలింపు, ఇంధన వినియోగం పెరుగుతున్న దృష్ట్యా తాత్కాలికంగా ఇంధన రేషన్ విధానంను అమలులోకి తీసుకొచ్చింది. సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అదే సమయంలో, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాపై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల

నగరం నుంచి భారీగా ప్రజలు తరలివస్తుండటంతో పక్కనున్న గ్రామాల్లో అకస్మాత్తుగా జనాభా పెరిగింది. అక్కడి వనరులపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాసాలు, తినుబండారాల కొరత సమస్యలుగా మారుతున్నాయి. ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Read also: Tehran : వెంటనే టెహ్రాన్ ఖాళీ చేయండి – ట్రంప్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.