పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు (Teachers) అది పక్కనపెట్టి ఏకంగా క్లాస్ రూమ్లోనే సిట్టింగ్ వేశారు. దర్జాగా బార్లో కూర్చోని తాగుతున్నట్లు క్లాస్ రూమ్లో మందు పార్టీ చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు (Teachers) చేసిన ఈ ఘన కార్యం ఏకంగా వీడియో రూపంలో బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలోని ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు (Teachers) తరగతి గదిలోనే మద్యం సేవిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. హసన్పూర్ బ్లాక్ పరిధిలోని ఫయాజ్నగర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో మానవత్వాన్ని మరిచిన ఘట్టం చోటు చేసుకుంది. హసన్పూర్ బ్లాక్ పరిధిలోని ఫయాజ్నగర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు తరగతి గదిలోనే మద్యం సేవించిన ఘటన వైరల్ వీడియో రూపంలో బయటపడింది.
సంఘటన పూర్తి వివరాలు:
గ్రామస్తుల కథనం ప్రకారం, సుతారి గ్రామంలోని సమీపంలోని పాఠశాలకు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవింద్ కుమార్, మరొక ప్రధానోపాధ్యాయుడు అనుపాల్, రోజూ పాఠశాల ఆవరణలో పిల్లల ముందు మద్యం సేవించేవారని ఆరోపించారు. ఒక రోజు వారిద్దరు తరగతి గదిలో మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు వీడియో తీసి జిల్లా మేజిస్ట్రేట్కు సమర్పించారు. ప్రాథమిక విచారణ తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ నిధి గుప్తా వాట్స్ ఇద్దరు ఉపాధ్యాయు (Teachers) లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన ఈ వీడియోలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో తరగతి గదిలోని టేబుల్పై మద్యం పోసి సేవిస్తున్నట్లు చూడవచ్చు. బ్లాక్ విద్యా అధికారి ఈ విషయంపై దర్యాప్తు చేసి, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఇద్దరు ఉపాధ్యాయు (Teachers) లపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థ పట్ల అవమానం కలిగించే చర్యలు. విద్యార్థులకు పాఠశాలలు భద్రతా స్థలాలుగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు శిక్షణ, నియంత్రణ మరియు పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలి.
Read Also: Trump Netanyahu: ట్రంప్..భారత్-పాక్ వివాదంలో దూరకు: ఇజ్రాయెల్ !