అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎంపికైన తర్వాత ప్రతిరంగంలోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు. ప్రత్యేకంగా విదేశీవిధానంపై పలు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నారు. దీంతో దేశాలమధ్య విభేదాలను పెంచుతున్నారు. తాజాగా తాలిబన్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికల్ని చేశారు. అఫ్ఘనిస్థాన్లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై తాలిబన్ ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని పేర్కొంది.
అఫ్ఘాన్ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇచ్చేది లేదని తాలిబన్ రక్షణశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్ ఫిత్రాత్ తెలిపారు. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రాంను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు. అఫ్గాన్కు చెందిన ఒక్క అంగుళం పైనా ఒప్పందం సాధ్యం కాదు. మే అటువంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదు. స్వయంప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత చాలా ముఖ్యం’ అని పసివుద్దీన్ ఫిత్రాప్ అన్నారు.
దీటుగా స్పందించిన తాలిబన్ ప్రతినిధులు
బాగ్రాం ఎయిర్ బేస్(Bagram Air Base) ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. లేదంటే అఫ్గాన్ పై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే, ఇదే అంశంపై అఫ్గాన్ తో చర్చలు జరుపుతామని, దాన్ని తిరిగి తీసుకుంటామని తెలిపారు. అందుకు వారు నిరాకరిస్తే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధులు దీటుగా స్పందించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బాగ్రాం ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బ్రిటన్ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కేవలం గంట వ్యవధిలో అణు ప్రదేశాలను చేరుకోవచ్చని అన్నార. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా కూడా ఇటీవల స్పందించింది. అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమై బగ్రాం ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు.
చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు ఇది అతి దగ్గరగా ఉంటుందని, కేవలం గంట వ్యవధిలో వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయంపై బీజింగ్(Beijing) స్పందిస్తూ అఫ్గాన్ భవిష్యత్తు అకడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి అమెరికా, తాలిబన్ సర్కార్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. రెండేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్కు వచ్చిన అమెరికా టూరిస్టు కిడ్నాపు గురయ్యాడు. ఇరుదేశాల చర్చల తర్వాత, అతడిని ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు.
తాలిబన్ ఎందుకు అమెరికాకు భూమి ఇవ్వబోమని ప్రకటించింది?
తాలిబన్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం వారి సార్వభౌమాధికారానికి చెందుతుంది కాబట్టి ఏ విదేశీ దేశానికీ ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది.
ఈ ప్రకటన ఎప్పుడూ, ఎక్కడ వెలువడింది?
కాబూల్లో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో తాలిబన్ ప్రతినిధులు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: