చైనా నుంచి ముప్పు తీవ్రమవుతున్న వేళ, తైవాన్ తన రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎనిమిదేళ్లలో రక్షణ రంగం కోసం 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.3లక్షల కోట్లు) భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు అధ్యక్షుడు విలియం లాయ్ చింగ్-తె ప్రకటించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలతో ‘అభేద్యమైన తైవవాన్’ ను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చైనాతో విభేదాల కారణంగా గత దశాబ్ద కాలంగా డిఫెన్స్ రంగంపై తైవాన్ తన రక్షణ వ్యయాన్ని పెంచుతోంది.
Read also : Trump: అమెరికా శాంతి ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్ ల నిర్ణయం ఏమిటి?

ఈ క్రమంలో, 2027 నాటికి చైనాను (China) ఎదుర్కొనేందుకు తమ సైన్యం అత్యున్నత స్థాయి యుద్ధ సన్నద్ధతను సాధిస్తుందని లాయ్ బుధవారం తెలిపారు. అమెరికా అధికారులు కూడా చైనా సైనిక చర్యకు ఇదే సమయాన్ని అంచనా వేస్తున్నట్లు గతంలో పేర్కొనడం గమనార్హం. ప్రజాస్వామ్య తైవాన్ ను శాశ్వతంగా కాపాడగల రక్షణ సామర్థ్యాలను నెలకొల్పడమే మా అంతిమ లక్ష్యం అని లాయ్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
స్వాగతించిన అమెరికా
తైవాన్ (Taiwan) నిర్ణయాన్ని ఆ దేశంలోని అమెరికా రాయబారి రేమండ్ గ్రీన్ స్వాగతించారు. మరోవైపు, ‘భాహ్య శక్తుల’ ఒత్తిడితోనే తైవాన్ ఈ నిర్ణయాలు తీసుకుంటోందని చైనా ఆరోపించింది. నిత్యం చైనా నుంచి తైవాన్ కు ముప్పు తీవ్రమవుతోంది. తైవాన్ పై తన ఆధిపత్యాన్ని చూపేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. దీంతో తైవాన్ కు ఇదొక పెద్ద సవాల్ గా మారింది.దీంతో తమ దేశ రక్షణ కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరమని గుర్తించి, ఈ నిర్ణయం తీసుకుంది తైవాన్ ప్రభుత్వం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :