📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌ పై ఎఫెక్ట్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: March 1, 2025 • 6:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూయార్క్‌: ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యూఎస్‌ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ భారత్‌పై కూడా పడింది. ఇండియా లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్‌లు మూతబడినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 5 వేల మందికి వీటి వైద్య సేవలు అందడం లేదని సమాచారం. దేశంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్లినిక్, అలాగే మహారాష్ట్రలోని కల్యాణ్, పూణే ప్రాంతాల్లో ఉండే క్లినిక్‌లు కూడా మూతపడినట్లు తెలుస్తోంది.

ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షలు

2021లో హైదరాబాద్‌లో మొదటిసారిగా మిత్ర ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు హర్మోన్ థెరపీపై అవగాహవన కల్పించడం, మానసిక ఆరోగ్యంతో పాటు HIV, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్‌ ఇవ్వడం సేవలు అందించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాదు సాధారణ వైద్య సంరక్షణ, న్యాయసహాయంతో పాటు పలు సేవలు అందించినట్లు పేర్కొన్నాయి. ఈ సేవలు అందించేందుకు ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షల వరకు అవుతాయని చెప్పాయి.

భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు

భారత్‌ లో 3 ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌లు మూసేసారని వస్తున్న వార్తలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌, అలాగే రిపబ్లికన్ పార్టీ సెనెటర్‌ జాన‌ కెన్నెడీ స్పందించారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వల్ల ఏ దేశాలు బాగుపడుతాన్నాయో, ఎక్కడికి నిధులు వెళ్తున్నాయో ఇప్పుడైనా అర్థం అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికన్లు చెల్లించిన పన్నులతో నిధులు సమకూర్చిన అన్ని ప్రాజెక్టులు నిలిపివేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు విదేశీ సహాయాలను నిలిపివేయాలని ఇటీవల ట్రంప్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu Telugu News online usaid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.