📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shikha Garg: విమాన ప్రమాదంలో మృతురాలి కుటుంబానికి 317 కోట్లు

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2019లో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన కీలక తీర్పు వెలువడింది. ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్ 737 MAX విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మహిళ శిఖా గార్గ్‌(Shikha Garg) కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (సుమారు ₹317 కోట్లు) పరిహారం చెల్లించాలంటూ చికాగో ఫెడరల్ కోర్టు ఆదేశించింది. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సాగిన న్యాయ పోరాటానికి ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు.

Read Also: Bihar Results: బీహార్ లో ఎన్డీఏ ఉద్యోగావకాశాలను కల్పించగలదా?

ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ

శిఖా గార్గ్(Shikha Garg) ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, యూఎన్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు నైరోబీ వెళ్తుండగా 2019 మార్చిలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించారు. అడిస్‌ అబాబా బోల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోవడంతో ఆమెతో సహా 150 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు.

ఈ ఘటనకు ఐదు నెలల కిందటే ఇండోనేషియాలో మరో బోయింగ్ 737 MAX ప్రమాదం సంభవించింది. ఆ రెండు ప్రమాదాల్లో కలిపి 340 మంది ప్రాణాలు కోల్పోవడంతో సంస్థపై ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. విమానం మోడల్‌ డిజైన్‌లో లోపాలు ఉండటమే ప్రమాదాలకు కారణమని పలువురు బాధిత కుటుంబాలు ఆరోపించాయి. ప్రయాణికుల భద్రతపై సంస్థ నిర్లక్ష్యం చూపిందంటూ శిఖా కుటుంబం కూడా కోర్టులో దావా వేసింది.

శిఖా గార్గ్ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు

చివరకు, శిఖా గార్గ్ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు న్యాయవ్యయాలు కలిపి భారీ మొత్తాన్ని చెల్లించాలని అమెరికా ఫెడరల్ జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ ఘటనల తర్వాత ప్రపంచంలోని అన్ని 737 MAX విమానాల సర్వీసులను నిలిపివేసి, 2020 డిసెంబర్‌లో మళ్లీ కార్యకలాపాలను పునరుద్ధరించారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌ నుంచి యూకేకు బయలుదేరిన బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిన విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికాడు. విమానం ఒక మెడికల్ కాలేజీ భవనంపై పడ్డ కారణంగా నేలపై ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

#AirCrashInvestigation #AviationNews #Boeing737MAX #ChicagoCourt #ShikhaGarg #UNConsultant BoeingPlaneCrash

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.