ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ విదేశీవిధానంలో తనకు అనుకూలంగా మలచుకుంటున్నది. ఇందులో భాగంగా పాక్ పీఎం PM షెహబాజ్ షరీఫ్ Shahbaz వైట్ హౌస్ లో White House అడుగుపెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటన చేపట్టిన ఆయన వైట్ హౌస్ లో ద్వైపాక్షిక సమావేశాలకు హాజరు కానున్నారు. ట్రంప్ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. ఈ మేరకు వైట్ హౌస్ అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. భారత్-అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ పాకిస్తాన్ పీఎంకు విందు ఇవ్వబోతోండటం చర్చనీయాంశమైంది.
Oracle: వేల కోట్ల సంపద విరాళంగా ప్రకటించిన ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు
Shahbaz
ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న షెహబాజ్ Shahbaz ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి షెహబాజ్ అమెరికా వెళ్లారు. సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాత ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంది. అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ Donald Trump నుంచి ఆహ్వానం అందిందాయనకు. దీంతో న్యూయార్క్ New York నుండి నేరుగా వాషింగ్టన్ చేరుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశాలకు పాల్గొంటారు. అక్కడే ఆయన ఇచ్చే విందుకు హాజరవుతారు.ఎనిమిది ఇస్లామిక్ అరబ్ దేశాలతో ట్రంప్ సమావేశం డొనాల్డ్ ట్రంప్ ఎనిమిది ఇస్లామిక్-అరబ్ దేశాల నాయకులతో సమావేశం కానున్నారు. షరీఫ్ తో సమావేశానికి ముందు ట్రంప్ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తారు. ఇందులో టిక్ టాక్ భద్రతా ఒప్పందాన్ని ఖరారు చేసే ఒప్పందం కూడా ఉందని వైట్ హౌస్ చెబుతోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక పాక్తో తన సంబంధాలను మెరుగుపర్చుకుంటున్నారు. గతంలో పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ నూ వైట్ హౌస్ కు ఆహ్వానించారు ట్రంప్.
పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఎందుకు వైట్ హౌస్ కు వెళ్తున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక సమావేశాలు, విందులో పాల్గొనడానికి వెళ్తున్నారు.
ఈ భేటీ ప్రాధాన్యం ఏమిటి?
భారత్-అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ పాక్ పీఎంకు విందు ఇవ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: