అగ్రరాజ్యం కెనడా(Canada)లో నివసిస్తున్న భారతీయ సంతతి దంపతులు దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబీ, హిందీ మాట్లాడే వర్గాలకు చెందినవారు.. కొడుకులను కనేందుకు ఆసక్తి చూపిస్తూ.. గర్భంలో ఉన్నది ఆడపిల్లా, మగ పిల్లాడా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. అక్కడితో ఆగకుండా గర్భంలో ఉన్నది అమ్మాయి అని తెలిస్తే.. అబార్షన్లు చేయించుకుంటున్నట్లు ఓ కొత్త పరిశోధన వెల్లడించింది. ‘జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కెనడా’లో ప్రచురించబడిన ఈ నివేదిక.. ఈ అంశంపై కెనడాలో తీవ్ర చర్చకు దారితీసింది.
Read Also: Vikram Singh: ఇండిగో విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఛైర్మన్

విపరీతంగా పెరిగిన గర్భస్రావాల సంఖ్య
పరిశోధకులు ఏప్రిల్ 1993 నుంచి మార్చి 2014 మధ్య అంటారియో ఆసుపత్రుల్లో జన్మించిన 46,834 మంది భారతీయ సంతతి తల్లుల ప్రసవ రికార్డులను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో భాగంగా.. ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్న భారతీయ వలసదారులైన మహిళల్లో మగ, ఆడ పిల్లల నిష్పత్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా పంజాబీ, హిందీ మాతృ భాషగా ఉన్న తల్లులలో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. అలాగే గతంలో జరిగిన గర్భస్రావాల సంఖ్య విపరీతంగా పెరగడంతో.. మగ పిల్లాడి పట్ల పక్షపాతం బలపడుతోందని పరిశోధన తేల్చింది. ఇది లింగ నిర్ధారణ పద్ధతులకు నిదర్శనంగా పేర్కొంది.
నడాలో నివాసంతోనూ మార్పు లేదు
ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశం ఏంటంటే.. భారతీయ వలసదారులైన తల్లులు కెనడాలో ఎంత కాలం నివసించినా.. మూడో బిడ్డ జననం విషయంలో మగ, ఆడ పిల్లల నిష్పత్తిలో సమతుల్యత ఏర్పడలేదు. ఈ పరిస్థితి ప్రధానంగా పంజాబీ మాట్లాడే మహిళలు, కొంతవరకు హిందీ మాట్లాడే మహిళల్లోనే కనిపిస్తోంది. ఈ ఫలితాలు భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో ఉన్న అధిక లింగ నిష్పత్తికి అనుగుణంగా ఉన్నాయి. మగ పిల్లల ప్రాధాన్యత, స్త్రీలపై వివక్ష వంటి సాంస్కృతిక అంశాలు ఈ కమ్యూనిటీల్లో సంతానోత్పత్తి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: