ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా కువైట్లోని అమెరికా నావల్ బేస్పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి జరిపిన ఈ దాడిలో అమెరికాకు చెందిన ఒక కీలకమైన నౌక పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తుండటంతో వాషింగ్టన్లో ఆందోళన నెలకొంది.
Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!
కువైట్తో పాటు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అమెరికా స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. UAEలోని అమెరికాకు చెందిన ‘MSP క్లాస్ షిప్’పై డ్రోన్ల ద్వారా దాడులు జరిగినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్న ఈ వరుస దాడులతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. అమెరికా తన దళాలను అప్రమత్తం చేయడంతో, ఈ సంఘర్షణ మరింత విస్తరించి ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :