📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

పాక్ లో రైలు హైజాక్ 104 మందిని కాపాడిన భద్రత సిబ్బంది

Author Icon By Anusha
Updated: March 12, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బిఎల్ఏ) మరోసారి విరుచుకుపడింది. క్వెట్టా నుండి పెషావర్‌ వెళుతున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన మిలిటెంట్లు, 30 మంది పాక్‌ సైనికులను హత్య చేసినట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

రైలు హైజాక్

క్వెట్టా నుండి బయలుదేరిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్ మామూలుగా సాగుతూ ఉండగా, బలూచిస్తాన్‌లోని బలోన్ ప్రాంతంలో,రిమోట్‌ ప్రాంతమైన బలోన్‌లో 8వ నంబర్‌ టన్నెల్‌ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్‌ను పేల్చివేసి ట్రైన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపిన మిలిటెంట్‌ సంస్థ.. 30 మంది పాక్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది. రైలు ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

డిమాండ్ లు

“మిలిటరీ ఆపరేషన్‌ చేపడితే, మిగిలిన బందీలను కూడా చంపుతాము” అంటూ పాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బందీలను విడిచిపెట్టాలంటే,ముఖ్యంగా బలోచ్‌ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని కోరింది. బిఎల్ఏ ఈ డిమాండ్‌లను నెరవేర్చేందుకు 48 గంటల గడువు విధించింది.

పాక్‌ భద్రతా బలగాల ఆపరేషన్

ఈ ఘటనతో పాకిస్తాన్‌ ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించి, ఘటనాస్థలికి భారీగా భద్రతా బలగాలను తరలించింది. సైనికులు మిలిటెంట్లపై కాల్పులకు దిగగా, డ్రోన్, వైమానిక దాడులతో దాడి చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 104 మంది బందీలను రక్షించినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. ఈ బందీలలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.పాక్‌ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పికొట్టామని బలూచిస్తాన్‌ మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. 

బలూచిస్తాన్ తిరుగుబాటు

బలూచిస్థాన్‌పాకిస్థాన్‌ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్‌, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థస్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్‌ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్థాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.కొన్ని రోజుల క్రితం, బలూచ్ గ్రూపులు పాకిస్తాన్ – చైనాపై కొత్త దాడిని ప్రకటించాయి. బలూచ్ యోధులు ఇటీవల సింధీ వేర్పాటువాద గ్రూపులతో విన్యాసాలు ముగించారు. ఇప్పుడు తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. సింధీ, బలూచ్ సంస్థలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్‌లోని ప్రాజెక్టులకు పెద్ద ముప్పు ఏర్పడింది.

#Balochistan #BalochistanConflict #BalochLiberationArmy #BLA #HostageCrisis #JafferExpress #PakistanArmy #PakistanCrisis #PakistanNews #PakMilitary #Peshawar #Quetta #TerrorAttack #TrainHijack Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.