📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Saudi Arabia: ప్రమాదంలో మరణించిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొస్తారా?

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎవరూ మరణించినా కడసారిగా చూడాలని కోరుకుంటారు. కానీ కొందరి మరణం వారి కడచూపుకు కూడా నోచుకోలేరు. సౌదీ అరేబియాలో మక్కా-మదీనా మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సు, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగిన పూర్తిగా కాలిపోయింది. అయితే వారి మృతదేహాలు..స్వస్థలాలకు రావడానికి అక్కడి చట్టాలు అడ్డంకిగా మారాయి. ఉమ్రా యాత్రికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.

 సౌదీ అరేబియాలో హజ్,(Saudi Arabia) ఉమ్రా తీర్థయాత్రలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మతపరమైన యాత్ర సమయంలో (మక్కా, మదీనా లేదా సౌదీ అరేబియాలో ఎక్కడైనా) యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని వారి స్వదేశానికి పంపడానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ నియమం అనేక ఏళ్లుగా అమలులో ఉంది. అయితే హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది.

Read Also: Bank: బ్యాంకుల విలీనం పై జోరందుకుంటున్న ఊహగానాలు

Saudi Arabia: Will the bodies of those who died in the accident be brought home

సౌదీ అరేబియాలోనే ఖననం

మక్కా,(makkah) మదీనా వంటి తీర్థయాత్రలకు వెళ్లేముందు యాత్రికులు నింపే అధికారిక ఫారంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఒక వేళ ఈ యాత్ర సమయంలో యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి అంగీకరిస్తూ ఆ ఫారంలో వవారు సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భారత్ కు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వపరంగా బీమా సౌకర్యాలు లేవు

సౌదీ హజ్ చట్టం ప్రకారం.. హజ్, ఉమ్రా మతపరమైన యాత్రలు కాబట్టి వాటికి ప్రభుత్వం పరంగా ఎలాంటి బీమా ఆధారిత సౌకర్యాలు ఉండవు. హజ్ యాత్ర సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. హజ్ యాత్రికులు

భారత్ లో (India) ప్రైవేట్ బీమా తీసుకుని ఉంటే వారి పాలసీ ప్రకారం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను సౌదీ అరేబియా ప్రభుత్వం కాకుండా.. సంబంధిత యాత్రికుడి దేశం, వారి బీమా సంస్థ ద్వారా మాత్రమే పూరి చేయాల్సి ఉంటుంది. అరేబియా నిబంధనల ప్రకారం మరణించిన 45 మంది మృతదేహాలను బహుశా అక్కడే ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

disaster recovery Google News in Telugu Indian government aid. international coordination Latest News in Telugu mortal remains repatriation Saudi Arabia accident; Telugu News Today Umrah pilgrims

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.