సౌదీ అరేబియాలో ఉమ్రా భక్తులను కుదిపేసిన ప్రమాదం
సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భక్తులను తీసుకెళ్తున్న బస్సు తెల్లవారుజామున ముఫ్రిహాత్ సమీపంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న(Saudi Arabia) క్షణాల్లోనే మంటలు విపరీతంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘోర విషాదంలో దాదాపు 42 మంది సజీవదహనం అయ్యారు.
Read also: షేక్ హసీనాకు ఢాకా ఐసీటీలో మరణశిక్ష
హైదరాబాద్కు చెందిన భక్తులపై దారుణ ప్రభావం
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హైదరాబాద్(Hyderabad) వాసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 18 మంది(Saudi Arabia) హైదరాబాద్కు చెందినవారే ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిసింది. బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడ్డ 4 మందిని వెంటనే మదీనాలోని అల్-హమ్నా ఆసుపత్రికి తరలించారు. సౌదీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించగా, సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: