📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Saudi Arabia: సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

Author Icon By Vanipushpa
Updated: December 19, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ అవమానం ఎదురైంది. పవిత్రమైన ఉమ్రా, పర్యాటక వీసాలను అడ్డం పెట్టుకుని విదేశాల్లో ‘భిక్షాటన’ను ఒక వృత్తిగా మార్చుకున్న వేలాది మంది పాక్ పౌరులపై సౌదీ అరేబియా(Saudi Arabia), యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కొరడా ఝుళిపించాయి. నేరాలు, యాచనకు పాల్పడుతున్న దాదాపు 56,000 మంది పాకిస్థానీయులను సౌదీ అరేబియా తాజాగా బహిష్కరించింది. పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్కడి పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడి అయ్యాయి.

Read Also: Israel: ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

Saudi Arabia

వర్క్, టూరిస్ట్, ఉమ్రా వీసాల పేరుతో..

పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) నివేదిక ప్రకారం.. 2025లో అక్రమ వలసలు, భిక్షాటన నిర్మూలనలో భాగంగా మొత్తం 66,154 మంది పాక్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించాయి. 2023లో ఈ సంఖ్య 35,000గా ఉండగా.. కేవలం ఏడాది కాలంలోనే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వీరిలో 51,000 మంది కేవలం వర్క్, టూరిస్ట్, ఉమ్రా వీసాల పేరుతో వెళ్లి అక్కడ యాచనకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సౌదీ అరేబియానే 24,000 మందిని బహిష్కరించగా.. దుబాయ్ 6,000 మందిని, అజర్‌బైజాన్ 2,500 మందిని వెనక్కి పంపింది. కేవలం గల్ఫ్ దేశాలే కాకుండా కాంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాలకు పర్యాటక వీసాలపై వెళ్తున్న పాకిస్థానీయులు కూడా అదృశ్యం అవుతున్నారని.. తిరిగి మాతృదేశానికి రావడం లేదని ఎఫ్‌ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మంటగలిసిపోతోంది

విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో (మక్కా, మదీనా వంటివి) అరెస్టవుతున్న భిక్షగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరు కేవలం భిక్షాటనకే పరిమితం కాకుండా యాత్రికుల జేబులు కత్తిరించడం వంటి నేర కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు వివరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా పాకిస్థాన్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మంటగలిసిపోతోందని నివేదిక పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

begging ban Breaking News in Telugu Google News in Telugu illegal activities abroad Latest In telugu news law enforcement action migrant issues Pakistani citizens Saudi Arabia news Saudi immigration laws Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.