బాలీవుడ్ ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), షారుఖ్ ఖాన్లకు మరోసారి బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గురువారం రాత్రి బెదిరింపు సందేశం రాగా, షారుఖ్ ఖాన్(Salman Khan)కు మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రెండు ఘటనలపై ముంబై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 5, గురువారం రాత్రి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు ఒక బెదిరింపు సందేశం అందింది. “మై సికిందర్ హూఁ” అనే పాట రచయితను ప్రస్తావిస్తూ వచ్చిన ఈ సందేశంలో, నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్కు గతంలోనూ పలుమార్లు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
షారుఖ్ ఖాన్కు రూ.50 లక్షలు డిమాండ్
మరో ఘటనలో, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Salman Khan) కు కూడా బెదిరింపులు వచ్చాయి. జూన్ 3, మంగళవారం బాంద్రా పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, షారుఖ్ ఖాన్ను చంపేస్తానని బెదిరించాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను “హిందుస్థానీ”గా పరిచయం చేసుకున్నాడు. డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్(Salman Khan) ను హతమారుస్తానని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్ను ట్రేస్ చేయగా, అది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాది పేరు మీద ఉన్నట్లు తేలింది. అయితే, తన ఫోన్ దొంగిలించబడిందని ఫైజాన్ ఖాన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ముంబై పోలీసులు అతడిని విచారణ నిమిత్తం పిలిపించారు.
గత బెదిరింపులు
ఇది కొత్త బెదిరింపు మాత్రమే కాదు; 2024లో కూడా సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 2024లో, గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ను చంపేస్తామని హెచ్చరించారు. అంతేకాక, గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా షారుఖ్ ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా 2023 అక్టోబర్లో ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల విడుదల సమయంలో వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతను వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. ప్రస్తుతం తాజా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రెండు వేర్వేరు ఘటనలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ వరుస బెదిరింపులతో బాలీవుడ్లో భద్రతాపరమైన ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముంబై పోలీసులు ఈ తాజా బెదిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సందేశం పంపిన వ్యక్తి గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో, సల్మాన్ ఖాన్కు వై-ప్లస్ భద్రతా కేటగిరీ కేటాయించబడింది.
Read Also: Sonam Raghuvanshi: సోనమ్ బాయ్ఫ్రెండ్ అరెస్టు.. విచారణలో కీలక