📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Sajib Wazed: బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని.. అది భారతదేశ భద్రతకు పెను సవాలుగా మారబోతోందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో (Bangladesh) ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఇది పొరుగునే ఉన్న భారత్ కు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిబ్ వాజెద్ ఈ సంచలన నిజాలను వెల్లడించారు. సరిహద్దుల్లో ఉగ్ర నీడలు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాద శక్తులు బలోపేతం అవుతున్నాయని సాజిబ్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్-ఖైదా వంటి భయంకరమైన ఉగ్ర సంస్థలకు చెందిన వ్యక్తులు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు.

Read also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

Sajib Wazed

ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్లు బహిరంగ సభల్లో పాల్గొన ప్రసంగిస్తున్నారు. గతంలో మా అవామీ లీగ్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి, భారత తూర్పు సరిమద్దులను సురక్షితంగా ఉంచింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన వివరించారు. కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జమాతే ఇస్లామీ వంటి కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టేలా పావులు కదుపుతోందని ఆరోపించారు. దేశంలోని సగం మంది ఓటర్ల హక్కులను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఇది ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bangladesh India Security latest news Political Crisis Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.