బంగ్లాదేశ్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని.. అది భారతదేశ భద్రతకు పెను సవాలుగా మారబోతోందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో (Bangladesh) ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఇది పొరుగునే ఉన్న భారత్ కు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిబ్ వాజెద్ ఈ సంచలన నిజాలను వెల్లడించారు. సరిహద్దుల్లో ఉగ్ర నీడలు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాద శక్తులు బలోపేతం అవుతున్నాయని సాజిబ్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్-ఖైదా వంటి భయంకరమైన ఉగ్ర సంస్థలకు చెందిన వ్యక్తులు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు.
Read also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

Sajib Wazed
ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు
పాకిస్తాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్లు బహిరంగ సభల్లో పాల్గొన ప్రసంగిస్తున్నారు. గతంలో మా అవామీ లీగ్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి, భారత తూర్పు సరిమద్దులను సురక్షితంగా ఉంచింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన వివరించారు. కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత తీరుపై సాజిబ్ తీవ్ర విమర్శలు చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జమాతే ఇస్లామీ వంటి కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టేలా పావులు కదుపుతోందని ఆరోపించారు. దేశంలోని సగం మంది ఓటర్ల హక్కులను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఇది ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: