రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావం చూపవని ఆయన స్పష్టంగా చెప్పారు. దేశ అవసరాలు, జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని మరోసారి తేల్చి చెప్పారు.
Read Also: NSC Scheme:పైసా రిస్క్ లేకుండా డబ్బు పెంచుకోవాలా? అయితే ఇలా చెయ్యండి!
ప్రస్తుతం మార్కెట్ సంక్లిష్టంగా ఉంది
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైశంకర్ (S Jaishankar) స్పందించారు. జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు బదులిస్తూ, చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉందని అన్నారు.
ఇంధన సమస్యల విషయానికి ప్రస్తుతం మార్కెట్ సంక్లిష్టంగా ఉందని వెల్లడించారు. చమురు కొనుగోళ్లకు సంబంధించి భారత్లోని కంపెనీలు యూరోప్తో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తాయని అన్నారు. ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి వారి ప్రయోజనాలకు తగినట్లు కొనుగోళ్లు జరుపుతారని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: