రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గత నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నా యుద్ధం మాత్రం ఆగడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన మొండిపట్టును వీడడం లేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా 20 సూత్రాల ప్రణాళికతో ఉక్రెయిన్-రష్యాలు అంగీకరించాలని పేర్కొన్నారు. దీనికి రెండు దేశాలు ఎంతవరకు అంగీకరిస్తాయో తెలియదు కానీ గత నాలుగేళ్లుగా వ్లాదిమిర్ పుతిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూనే ఉంది.
ఈ నాలుగేళ్లు పుతిన్ పేరు మీడియాలో తరచుగా వినిపిస్తూనే వస్తున్నది.
ఈ వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి?
శిఖరాగ్ర సమావేశాల కోసం రానున్న పుతిన్..
గతంలో రష్యా (Russia) అధ్యక్షుడి పర్యటనల చరిత్రను పరిశీలిస్తే.. పుతిన్ (Putin) ఇప్పటివరకు పదిసార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఆయన తొలిసారిగా 2000 అక్టోబర్లో భారత్ ను సందర్శించారు. ఆ సమయంలో రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అనంతరం వరుసగా డిసెంబరు 2002, డిసెంబరు 2004, జనవరి 2007, మార్చి 2010, డిసెంబరు 2012,డిసెంబరు 2014, డిసెంబర్ 2021లలో భారతదేశాన్ని సందర్శించారు. కొన్ని సందర్భాలు మినహా ఎక్కువగా డిసెంబర్ లోనే భారత్ ను సందర్శించారు. భారత్-రష్యా మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ లో జరగడమే దీనికి ప్రధాన కారణం. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు శిఖరాగ్ర సమావేశాల కోసమే భారతదేశాన్ని సందర్శించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: