భారతదేశం ఇంకా ఎంతోకాలం రష్యా (Russia) నుంచి చమురు దిగుమతి చేసుకోబోదని, ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా (Russia)స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు ఎంతో ముఖ్యమని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రష్యా (Russia)డిస్కౌంట్పై భారత్కు చమురు ఎగుమతి చేస్తున్నదని, దాంతో ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని అన్నారు. కాగా రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంగా ట్రంప్ భారత్పై భారీగా సుంకాలు విధించారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా సాయపడినట్లు అవుతుందని, కాబట్టి రష్యా చమురును కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. అయితే అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోకపోవడంతో అదనపు సుంకాలు వేసింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తానని మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పడం చర్చనీయాంశమైంది. 2022 తర్వాత, భారతదేశం తన చమురు దిగుమతులలో రష్యా వాటాను భారీగా పెంచుకుంది. కొన్ని నెలల పాటు, రష్యా భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. సౌదీ అరేబియా, ఇరాక్లను కూడా అధిగమించింది.
రష్యా ధనిక దేశమా లేక భారతదేశమా?
భారతదేశం రష్యా కంటే ధనిక దేశం కాదు, కానీ దాని మొత్తం ఆర్థిక వ్యవస్థ (GDP) పెద్దది, అయితే రష్యా తలసరి ప్రాతిపదికన ధనిక దేశం. భారతదేశం యొక్క చాలా పెద్ద జనాభా దాని తలసరి ఆదాయం రష్యా కంటే తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.
రష్యా భారతదేశాన్ని రక్షిస్తుందా?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించడానికి రష్యా కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా, భారతదేశం NSG మరియు APECలో చేరడానికి రష్యా గట్టిగా మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, భారతదేశం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న SAARCలో పరిశీలకుడి హోదాతో చేరడానికి కూడా ఆసక్తిని వ్యక్తం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: