భారత్-పాక్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం తదనంతరం పాకిస్తాన్ సైనిక విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. సైనిక బలాన్ని పెంచుకునేందుకు అధిక నిధులను కేటాయిస్తున్నది. దేశంలో ప్రజలు నిత్యావసర వస్తువులకోసం, కనీస అవసరాలకోసం అల్లాడుతుంటే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా సైనిక అవసరాలను తీర్చేందు ప్రాధాన్యత ఇస్తున్నది. తన సైనిక బలాన్ని పెంచుకునేందుకు అడ్డదారులను కూడా తొక్కుతున్నది. తాజాగా పాకిస్తాన్(Pakistan) గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) రష్యా (Russia) సైనిక సాంకేతికతను దొంగలించడానికి పన్నిన ప్రణాళికను మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఐఎస్ఐ ఆపరేషన్ లో రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
Read also: ఏపీలో 1.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం
రష్యన్ జాతీయుడిని అరెస్టు చేసిన ప్రభుత్వం
రష్యా కౌంటర్-ఎసిపయోనేజ్ ఆపరేషన్ లో భాగంగా, సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ సాంకేతికత అభివృద్ధికి ఉపయోగించే పత్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు యత్నించినట్లు తెలిసింది. రష్యా(Russia) కౌంటర్-ఎసిపయోనేజ్ ఆపరేషన్ లో భాగంగా, సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ సాంకేతికత అభివృద్ధికి ఉపయోగించే పత్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. మరింత తోలుగా దర్యాపు ఐఎస్ఐ నెట్ వర్క్ దొంగలించడానికి ప్రయత్నించిన సాంకేతికతలో మిలిటరీ రవాణా హెలికాప్టర్లకు సంబంధించిన కీలక డాక్యుమెంటు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా రూపొందించిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400కు సంబంధించిన టెక్నాలజీ కూడా దొంగలించడానికి యత్నించినట్లు రష్యా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మరింత తోలుగా దర్యాప్తు జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: