📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Riaz Hamidullah: అత్యవసర పిలుపుతో ఢాకాకు వెళ్లిన బంగ్లా హైకమిషనర్

Author Icon By Pooja
Updated: December 30, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లా(Riaz Hamidullah) అత్యవసరంగా భారత్ నుంచి ఢాకా వెళ్లారు. అది కూడా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అత్యవసర కాల్ రావడంతో సోమవారం రాత్రి ఢాకా చేరుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇటీవల బంగ్లాలో భారత్ కు(India) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం విధితమే. దైపాక్షిక సంబంధాల పరిస్థితిపై చర్చలు జరిపేందుకు రిజాజ్ హమీదుల్లాను ఢాకాకు పిలిపించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లా మీడియాకు తెలిపింది.

Read Also: Donald Trump: పుతిన్ నివాసంపై దాడి మండిపడ్డ ట్రంప్

Riaz Hamidullah The Bangladesh High Commissioner went to Dhaka following an urgent summons.

భారత రాయబార కార్యాలయంపై బెదిరింపులు

ఇటీవల ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై అక్కడి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని భారత(India) ప్రభుత్వం రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై హమీదుల్లా(Riaz Hamidullah) ముందు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్ కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే సెవెన్ సిస్టర్స్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

దెబ్బతిన్న రెండు దేశాల సంబంధాలు

గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, భారత్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్-బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్ కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై చర్చలు జరిపేందుకు రిజాజ్ హమీదుల్లాను బంగ్లాకు పిలిపించుకున్నట్లు బంగ్లా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపినట్లుగా బంగ్లా మీడియా తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh High Commissioner Dhaka Visit Emergency Call Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.