బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై వివక్ష ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హిందూ రాజకీయ నేత మరణం చర్చనీయాంశంగా మారింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు రమేషన్ చంద్రసేన్(Rameshan Chandrasen) (86) జైల్లోనే మరణించినట్లు సమాచారం. విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన గతంలో ఎంపీగా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
Read Also:Operation Sindoor: ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

గత 18 నెలలుగా జైల్లో ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా అనుమతి(Rameshan Chandrasen) లభించలేదు. చివరకు ఆరోగ్యం విషమించి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రసేన్పై దాడి జరిగిన ఘటనలో బాధితుడైనప్పటికీ ఆయనే అరెస్టయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఒక కేసు తర్వాత మరో కేసు నమోదు చేస్తూ ఆయనను విడుదల కాకుండా ఉంచారని సమాచారం. ఇదే సమయంలో ఇటీవల మరో అవామీ లీగ్ హిందూ నేత ప్రళయ చాకీ కూడా పోలీస్ కస్టడీలో మృతి చెందిన ఘటన వివాదాస్పదమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: