📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

India: అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్రనష్టం :రాహుల్​ గాంధీ

Author Icon By Vanipushpa
Updated: February 14, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి ఆరోపించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని ఆయన ఎక్స్‌లో దుయ్యబట్టారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటేనే, భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్‌ అన్నారు.

Read Also: Digital India: కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం

ఒకవేళ మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఉంటే పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారుల శ్రేయస్సును రక్షించే విధంగా చర్చలు జరిపి ఉండేదని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ, ఆయన ప్రభుత్వం కలిసి రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ​ ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా పత్తి, వస్త్ర పరిశ్రమ రంగాలపై ఆధారపడి ఉన్న కోట్లాది మంది భారతీయుల కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అనే గొయ్యిలోకి నెట్టివేశారని రాహుల్​ గాంధీ విమర్శించారు. గత వారం భారత్​-అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో యూఎస్​ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం వంటివి ఆ ఒప్పందంలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Agricultural Policy congress party farmers issue India Indian Agriculture political reactions India rahul gandhi Telugu News Paper Telugu News Today Trade agreement controversy US India agreement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.