Putin Ukraine war : రష్యా–యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్, ప్రస్తుతం తాము ఆక్రమించి ఉన్న ప్రాంతాలను విడిచిపెడితే యుద్ధ కార్యకలాపాలను ఆపుతామని, లేదంటే సైనిక బలం ద్వారానే ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కిర్గిజ్స్తాన్ పర్యటన సందర్భంగా మాట్లాడిన పుతిన్, “యుక్రెయిన్ దళాలు మా భూభాగాలనుంచి వెనక్కి వెళ్లితే వెంటనే యుద్ధాన్ని ఆపుతాం. (Putin Ukraine war) అలా చేయకపోతే సైనిక చర్యల ద్వారా మా లక్ష్యాన్ని సాధిస్తాం” అని స్పష్టం చేశారు.
అమెరికా–యుక్రెయిన్ మధ్య చర్చకు వచ్చిన డ్రాఫ్ట్ శాంతి ప్రతిపాదన భవిష్యత్ ఒప్పందాలకు పునాదిగా మారవచ్చని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఆ ప్రతిపాదన అమలుకాకపోతే యుద్ధం కొనసాగుతుందని చెప్పారు.
Latest News: TG GP Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది
అలాస్కా పర్యటనకు ముందు అమెరికా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరిగాయని, అనంతరం 28 అంశాల ప్రణాళిక రూపుదిద్దుకుందని తెలిపారు. జెనీవాలో జరిగిన అమెరికా–యుక్రెయిన్ చర్చల్లో ఈ అంశాలను సమూహాలుగా విభజించారని ఆయన చెప్పారు. అయితే తుది రూపం ఇంకా లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో కొన్ని అంశాలను రష్యా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని రష్యా జాతీయ భద్రత మండలి మాజీ అధికారి జెఫ్రీ ఎడ్మండ్స్ వ్యాఖ్యానించారు. రష్యా చర్చలను ఆలస్యం చేయడానికే ఆసక్తి చూపుతోందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, జెనీవాలో యుక్రెయిన్ ప్రతినిధులతో భేటీ అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చర్చలు “అత్యంత ప్రయోజనకరంగా, అర్థవంతంగా” సాగాయని తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :