📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ

Author Icon By sumalatha chinthakayala
Updated: March 11, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో ల్యాండ్ అయిన‌ట్లు మోడీ త‌న ఎక్స్ అకౌంట్‌లో వెల్ల‌డించారు. స్నేహితుడు, ప్ర‌ధాని డాక్ట‌ర్ న‌వీన్‌చంద్ర రామ్‌గూల‌మ్‌కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప‌ర్య‌ట‌న ద్వారా మారిష‌స్‌తో అనేక రంగాల్లో కొత్త సంబంధాలు ఏర్ప‌డ‌నున్న‌ట్లు చెప్పారు. అధ్య‌క్షుడు ధ‌ర‌మ్ గోకుల్‌తో భేటీ కానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇవాళ సాయంత్రం ఓ క‌మ్యూనిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్న‌ట్లు చెప్పారు. భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు మోడీకి స్వాగ‌తం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

మారిష‌స్‌తో భార‌త్‌కు గాఢ‌మైన బంధం

బుధ‌వారం మారిష‌స్‌లో 57వ జాతీయ దినోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌వాతు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భార‌తీయ సైనిక ద‌ళాలు పాల్గొంటున్నాయి. భార‌తీయ నౌకాద‌ళ యుద్ధ విమానంతో పాటు వైమానిక ద‌ళానికి చెందిన ఆకాశ గంగా స్కై డైవింగ్ బృందం పాల్గొన‌నున్న‌ది. హిందూ మ‌హాస‌ముద్రంలో ఉన్న మారిష‌స్‌తో భార‌త్‌కు గాఢ‌మైన బంధం ఉన్న‌ది. ఆఫ్రికా ఖండానికి వెళ్లేందుకు మారిష‌స్‌ను గేట్‌వేగా భావిస్తారు. హిస్ట‌రీ, జియోగ్ర‌ఫీ, క‌ల్చ‌ర్ ద్వారా రెండు దేశాలు క‌నెక్ట్ అయిన‌ట్లు మోడీ తెలిపారు. భార‌తీయ నేవీ, మారిష‌స్ అధికారుల మ‌ధ్య టెక్నిక‌ల్ అగ్రిమెంట్ జ‌ర‌గ‌నున్న‌ది. వాణిజ్యం, సీమాంత‌ర ఆర్థిక నేరాలు, చిన్న‌..మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి వంటి అంశాల‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mauritius PM Modi Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.