ఇంటర్నెట్లో విపరీతంగా పెరుగుతున్న అశ్లీల కంటెంట్పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలైంది. ఈ కంటెంట్ వల్ల చిన్నపిల్లల మనస్తత్వం దెబ్బతింటుందని, సమాజంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కోర్టు నేపాల్లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ, “అక్కడ ఇంటర్నెట్ సైట్లపై నిషేధం విధించడం వల్ల ఏ పరిస్థితులు ఏర్పడ్డాయో చూశాం కదా?” అనివ్యాఖ్యానించింది. అనంతరం, కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నందున, ఈ పిటిషన్పై ఆయన పూర్తి విచారణ చేపట్టకపోవచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also : Indian Women’s Cricket: టీమిండియా అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా?

Read Also: Bangalore: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు
పిటిషనర్ వాదనలు:
డిజిటలైజేషన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ల ద్వారా ఆన్లైన్ కంటెంట్కి సులభంగా పెరిగిందని పిటిషనర్ తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లల్లో మొబైల్ వాడకం అధికమైందని, దీని ఫలితంగా అశ్లీల కంటెంట్ సులభంగా అందుబాటులోకి వస్తోందని చెప్పారు.
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు, క్లిప్పులు విచ్చలవిడిగా ఉండటంతో పిల్లల మనసులు కలుషితమవుతున్నాయని, ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందని పిటిషనర్ హెచ్చరించారు.
ప్రభుత్వంపై ప్రశ్నలు:
దేశంలో 20 కోట్లకు పైగా అశ్లీల వీడియోలు, క్లిప్పులు ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నాయని, ఈ సైట్లను కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదని పిటిషనర్ ప్రశ్నించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69(A) ప్రకారం ఇలాంటి సైట్లను నిషేధించవచ్చని, కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
దేశవ్యాప్తంగా అశ్లీల కంటెంట్ నియంత్రణకు సంబంధించిన సమగ్ర జాతీయ విధానం తీసుకురావాలని, ఇందుకోసం కేంద్రాన్ని ఆదేశించాలంటూ కోర్టును అభ్యర్థించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: