PM Modi : పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

Read Time:  1 min
PM Modi shocked by Pope Francis death
PM Modi shocked by Pope Francis death
FONT SIZE
GET APP

PM Modi : అమెరికాకు చెందిన పోప్ ఫ్రాన్సిస్ (88) ఈ రోజు మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. కాగా పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ ద్వారా పోప్ ఫ్రాన్సిస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. “పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్ర బాధ కలిగింది. ఈ విషాద సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను.

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రధాని

ఆయన ఆత్మ దేవుని కౌగిలిలో శాశ్వత శాంతిని పొందుగాక

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పేదలు, అణగారిన వర్గాలకు శ్రద్ధగా సేవ చేశారు. నేను ఆయనతో నా సమావేశాలను ప్రేమగా గుర్తుంచుకుంటాను. సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి ఆయన నిబద్ధతతో ఎంతో ప్రేరణ పొందాను. భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మ దేవుని కౌగిలిలో శాశ్వత శాంతిని పొందుగాక” అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

Read Also: మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.