📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Telugu News: PM Modi: భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

Author Icon By Pooja
Updated: December 17, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండురోజుల జోర్డాన్ పర్యటన ఇరుదేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్ లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా-2తో ప్రధాని జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఫలితంగా 5 కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

Read Also:  US: వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

PM Modi: Key agreements signed between India and Jordan.

జోర్డాన్ కంపెనీలకు మోదీ ఆహ్వానం

పునరుత్పాదక ఇంధనం, కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారం కోసం ఇరుదేశాలు అంగీకరించాయి. ఇది స్వచ్చమైన ఇంధన వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. నీటి సంరక్షణ, యాజమాన్యం, అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారతదేశంలో విజయవంతమైన ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‘ జోర్డాన్ లోనూ అమలు చేసేలా సాంకేతికతను పంచుకోవాలని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు.

2025 నుంచి 2029 వరకు సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచేందుకు గతంలో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఇంకా ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన జోర్డాన్ లోని ‘పెట్రా’, భారత్ లోని(PM Modi) ఎల్లోరా గుహల మధ్య పర్యాటక, వారసత్వ సంరక్షణ కోసం ‘ట్విన్నింగ్’ ఒప్పందం కుదిరింది. జోర్డాన్లో 17,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి సహకారాన్ని మోదీ అభినందించారు. ‘భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరం’లో ప్రసంగించిన ప్రధాని, భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు కావాలని జోర్డాన్ కంపెనీలను ఆహ్వానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.