📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

PM Modi: ప్రధాని మోదీ ప్రారంభించిన అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్

Author Icon By Shobha Rani
Updated: June 5, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ను రీలాంచ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi). ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మర్రిచెట్టును నాటారు ప్రధాని మోదీ(PM Modi). దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాలను చేపట్టింది. అరావళీ పర్వత శ్రేణులు విస్తరించిన హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో చెట్లు పెంచి అడవులను పెంచి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో కేంద్రం ఈ గ్రీన్ బెల్ట్ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రీ లాంచింగ్ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల సీఎంలు పంచుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రధాని మోదీ(PM Modi)తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ దాద్రిలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా, గుజరాత్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేడాలో, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ రామ్‌గర్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

PM Modi: ప్రధాని మోదీ ప్రారంభించిన అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్

ఆఫ్రికాలోని ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ ఆదర్శంగా..
అరావళి పర్వత శ్రేణుల వెంబడి 700 కిలో మీటర్ల పరిధిలో కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత క్షీణిస్తున్న నేపథ్యంలో అరావళీ గ్రీన్ వాల్‌ ప్రాజెక్ట్‌కు తిరిగి ఊపిరిలూదుతోంది కేంద్రం. ఆఫ్రికాలోని పశ్చిమ సెనెగల్ నుంచి తూర్పు జిబౌటి వరకు అమలుచేస్తున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ ప్రేరణపొందిన భారత్ అరావళీ గ్రీన్‌వాల్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పచ్చదనం పెంపు – చెట్లు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించడం. అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ను మళ్లీ ఊపిరిలూదుతూ ప్రారంభించిన ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా పచ్చదనంపై దృష్టిపెట్టారు. పర్యావరణ పరిరక్షణ దేశాభివృద్ధిలో ఒక భాగంగా తీసుకుంటూ, ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రాజెక్ట్ లక్ష్యాలు:

మట్టి ధ్రూవీకరణ – ఎరిమి, ఎండిపోయే నేలలను ప్రొటెక్ట్ చేయడం
వాతావరణ మార్పులకు ఎదురొద్దం – వర్షాభావ ప్రాంతాల్లో తేమను నిలిపివేయడం
స్థానిక జీవవైవిధ్య సంరక్షణ – జంతువులకు నివాస ప్రాంతాల పునరుద్ధరణ
స్థానిక రైతులకు జీవనోపాధి – అగ్రో ఫారెస్ట్రీ ద్వారా ఆదాయం పెంపు
ఒక్కో వ్యక్తి ఒక చెట్టు నాటి, దాన్ని తాము గుర్తించుకునే పేరుతో పిలవడం
చెట్టు పెరిగే వరకు దానికి తాము తల్లిదండ్రుల్లా ఉండటం
దీని ద్వారా వ్యక్తిగత భాగస్వామ్యం పెరిగి, పర్యావరణ శ్రద్ధ వ్యక్తిగతంగా మారుతుంది.

Read Also: Environment: ప్రకృతిని కాపాడుకుందాం- అదే మన ఆశయం

Aravali Green Wall Project launched Breaking News in Telugu Google news Latest News in Telugu Paper Telugu News PM Modi: Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.