📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Plane Crash: సరదాగా భోజనం చేస్తూ మృత్యువు ఒడిలోకి చేరిన 20 మంది మెడికోలు

Author Icon By Sharanya
Updated: June 13, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఊహించని ఘోర ప్రమాదం క్షణాల్లో ఎందరో ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా భోజనం చేస్తూ ఉన్న మెడికల్ విద్యార్థులకు అది చివరి భోజనం అయింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ వద్ద చోటు చేసుకుంది.

చివరి మజిలీ:

సాధారణంగా ప్రతి విద్యార్థి లంచ్ టైమ్ కోసం ఎదురు చూస్తాడు. అలానే ఆ రోజు కూడా ఒంటి గంటా ముప్పై నిమిషాలకు విద్యార్థులు మెస్‌కి చేరుకుని భోజనం ప్రారంభించారు. నవ్వుల మధ్య, సరదా సంభాషణల మధ్య తింటూ ఉన్న వారిని మృత్యువు అప్రతీక్షంగా చుట్టుముట్టింది. ఎయిరిండియా ఏఐ171 విమానం నియంత్రణ కోల్పోయి హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో, దారుణమైన మంటలు చెలరేగాయి. భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు ఒక్కసారిగా ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది.

కలలు కలవరమయ్యాయి:

అదే వాళ్లకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు. విమానం రూపంలో మృత్యువు వస్తుందని డాక్టర్‌ కావాలన్న కలల్ని క్షణాల్లో ఆవిరి చేస్తాడని ఆ మెడికల్‌ విద్యార్థులు పసిగట్టలేకపోయారు. ఏ తల్లికన్న బిడ్డలో హాస్టల్‌ మెస్‌లోనే తమ చివరి మజిలీ పూర్తవుతుందని గుర్తించలేకపోయారు. కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇంటర్న్ వైద్యులు కాలిపోయి కాంక్రీట్ శిథిలాల కింద నలిగిపోయారు, మరికొందరు ముక్కలుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏఐ171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందగా. అది బిల్డింగ్‌పై కుప్పకూలడంతో 24 మంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది మెడికోలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. కాగా మరణాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. త్వరలోనే డాక్టర్‌ అవ్వాలి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఏళ్లుగా కలలు కన్నవాళ్లు కనీసం కన్నతల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదం తర్వాత హాస్టల్‌ మెస్‌లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం భోజనం చేసిన పేట్లు, చల్లాచెదురుగా పడివున్న టేబుల్స్‌, నేలపై పడిపోయిన అన్నం, కూరలను చూసి ఆ దేవుడ్ని సైతం నిలదీస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కడుపు నిండా భోజనం చేయనీయకుండానే తీసుకెళ్లావా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Air India Plane Crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి – ఎయిర్ ఇండియా ప్రకటన

#Ahmedabad #AirIndiaCrash #BJMedicalCollege #MedicalStudentsDeath #MedicosLost #PlaneCrash Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.