ఊహించని ఘోర ప్రమాదం క్షణాల్లో ఎందరో ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా భోజనం చేస్తూ ఉన్న మెడికల్ విద్యార్థులకు అది చివరి భోజనం అయింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ వద్ద చోటు చేసుకుంది.

చివరి మజిలీ:
సాధారణంగా ప్రతి విద్యార్థి లంచ్ టైమ్ కోసం ఎదురు చూస్తాడు. అలానే ఆ రోజు కూడా ఒంటి గంటా ముప్పై నిమిషాలకు విద్యార్థులు మెస్కి చేరుకుని భోజనం ప్రారంభించారు. నవ్వుల మధ్య, సరదా సంభాషణల మధ్య తింటూ ఉన్న వారిని మృత్యువు అప్రతీక్షంగా చుట్టుముట్టింది. ఎయిరిండియా ఏఐ171 విమానం నియంత్రణ కోల్పోయి హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో, దారుణమైన మంటలు చెలరేగాయి. భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు ఒక్కసారిగా ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది.
కలలు కలవరమయ్యాయి:
అదే వాళ్లకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు. విమానం రూపంలో మృత్యువు వస్తుందని డాక్టర్ కావాలన్న కలల్ని క్షణాల్లో ఆవిరి చేస్తాడని ఆ మెడికల్ విద్యార్థులు పసిగట్టలేకపోయారు. ఏ తల్లికన్న బిడ్డలో హాస్టల్ మెస్లోనే తమ చివరి మజిలీ పూర్తవుతుందని గుర్తించలేకపోయారు. కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇంటర్న్ వైద్యులు కాలిపోయి కాంక్రీట్ శిథిలాల కింద నలిగిపోయారు, మరికొందరు ముక్కలుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏఐ171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందగా. అది బిల్డింగ్పై కుప్పకూలడంతో 24 మంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది మెడికోలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. కాగా మరణాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. త్వరలోనే డాక్టర్ అవ్వాలి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఏళ్లుగా కలలు కన్నవాళ్లు కనీసం కన్నతల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం తర్వాత హాస్టల్ మెస్లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం భోజనం చేసిన పేట్లు, చల్లాచెదురుగా పడివున్న టేబుల్స్, నేలపై పడిపోయిన అన్నం, కూరలను చూసి ఆ దేవుడ్ని సైతం నిలదీస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కడుపు నిండా భోజనం చేయనీయకుండానే తీసుకెళ్లావా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read also: Air India Plane Crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి – ఎయిర్ ఇండియా ప్రకటన