📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

Author Icon By Divya Vani M
Updated: February 5, 2025 • 7:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. ఆధార్ కార్డులో పౌరుల పేర్లు చిరునామాలు, వయస్సు, మొబైల్ నంబర్ వేలిముద్రలు వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఈ పత్రం భారతీయుల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగం పై ఓ కొత్త మార్పును ప్రకటించింది ఇది ప్రజలలో కొన్ని అభ్యంతరాలను కలిగిస్తోంది.ప్రస్తుతం, భారతదేశంలో ప్రభుత్వం ఆధార్ కార్డును ఒక కీలక గుర్తింపుగా పరిగణిస్తుంది.కానీ,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ వివరాలను యాక్సెస్ చేయగలవు. అంటే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ఆధారిత సేవలను ఉపయోగించడానికి ఆధార్ వివరాలను ప్రభుత్వానికి అనుమతి తీసుకుని పొందవచ్చు.ఈ నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేటప్పుడు, వారికి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు కేంద్ర ప్రభుత్వానికి లేదా యూఐడీఏఐకి ఆధార్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.

వారు ఆధార్ వివరాలను అవసరమైన కారణంతో మాత్రమే అడగాలి అదే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అవి ఉపయోగించబడతాయి.అయితే ఈ కొత్త ప్రకటనతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే పద్ధతులపై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆధార్ లోని వేలిముద్రలు మరియు ఐరిస్ స్కాన్ వంటి సమాచారాన్ని వినియోగించడం వల్ల కొంతమంది మోసాలకు గురైన ఘటనలు కూడా జరిగాయి. మరింతగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాయి. అయితే ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఈ సమాచారాన్ని ప్రామాణీకరణ కోసం ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి.ఈ నిర్ణయం వల్ల ప్రజలు వారి వ్యక్తిగత సమాచార రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, దీనికి సుప్రీంకోర్టు ముందుగా వ్యతిరేకించిన విషయం గుర్తుండాలి.

Aadhaar Card Aadhaar Government Rules Aadhaar Privacy Aadhaar Update Personal Data Protection Private Companies Aadhaar Access

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.