బలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులతో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంపై దాడి చేస్తోంది. సొంత ప్రజలపైనే సైన్యం విరుచుకుపడుతోంది. సైన్యం దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు(extreme fear) గురవుతున్నారు. ప్రాణభయంతో వణికి పోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీదపడుతుందోననే భయంతో ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ టార్గెట్ ఉగ్రవాదుల ఏరివేతేనని సైనిక వర్గాలు వెల్లడించాయి.
Read Also: Visa: కొత్త వీసా నిబంధనలతో యూఎస్ వర్సిటీల ఆందోళన
సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ తో ప్రజలు లలాక్ డౌన్లోకి వెళ్లిపోయారు. ఇళ్లల్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సైన్యం ప్రయోగిస్తున్న బాంబుల(Bombs) వల్ల పత్తి పొలాలలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లి బరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.
పాకిస్థాన్ సైన్యం ఎక్కడ భారీ ఆపరేషన్ చేపట్టింది?
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టింది.
సైన్యం ఈ ఆపరేషన్లో ఏ విధమైన ఆయుధాలు ఉపయోగిస్తోంది?
సైన్యం డ్రోన్లు, మోర్టార్లు (Mortars), మరియు శతఘ్నులను (Artillery) ఈ దాడుల కోసం ఉపయోగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: