Pehalgam : దాడి ప్రభావం భారత్పై పాకిస్థాన్ ఆంక్షలు
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్థాన్ కూడా స్పందించింది. వాఘా బోర్డర్ను మూసివేయడంతో పాటు, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయాలను నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) అత్యవసర సమావేశం తర్వాత ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో టాప్ సివిల్, మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.భారత్లో ఉగ్రదాడుల అనంతరం పెరుగుతున్న భద్రతా చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్, భారత్కి వ్యతిరేకంగా ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సార్క్ వీసా మినహాయింపులను రద్దు చేయడంతో పాటు, భారత్లో ఉన్న పాకిస్థాన్ హైకమీషన్ సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇకపై భారతీయుల ప్రయాణాలకు పాక్ తన ఎయిర్స్పేస్ను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Pehalgam : దాడి తర్వాత పాకిస్థాన్ దేశం తీసుకున్న కీలక నిర్ణయాలు
అంతేకాకుండా, భారత్తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పార్లమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించిన పాక్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్, విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, రక్షణశాఖ ప్రతినిధులు భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. పెహల్గామ్ ఘటనకు సంబంధించి ఆధారాలు చూపించాలని, ప్రపంచ దేశాలకు భారత్కు వ్యతిరేకంగా జరిగిన చర్యల్ని వివరించాలని వారు డిమాండ్ చేశారు.విదేశీయుల చేత భారత్లోకి ఆయుధాలు సరఫరా చేసినట్లు పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. మొత్తం మీద, పెహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
Read More : Narayana Reddy : భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి