हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు

Anusha
ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌కు వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఏడుగురు ప్రయాణికులను హతమార్చారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్‌లోని బర్ఖాన్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, దుండగులు లాహోర్ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలను అడ్డగించారు. ఆ సమయంలో 45 మంది ప్రయాణికులతో బస్సు కూడా ఆ మార్గంలో వెళ్తోంది. దుండగులు బస్సును ఆపి, టైర్లలో గాలిని వదిలించి, ప్రయాణికులందరినీ బస్సు బయటకు దింపారు. అనంతరం, వారి గుర్తింపు కార్డులు చూపించాలని ఆదేశించారు. ఇందులో, ప్రత్యేకంగా ఏడుగురిని బస్సు దిగమని బలవంతపెట్టారు. వారిని కొంతదూరానికి తీసుకెళ్లి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి హత్య చేశారు. మృతులంతా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిగా గుర్తించారు.పంజాబ్‌లోని డేరా ఘాజాఖాన్ నుంచి బలూచిస్థాన్‌లోని బర్ఖాన్‌కు కలిపే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఖాదీమ్ హుస్సేన్ ఈ దుర్ఘటన వివరాలను రాయిటర్స్‌తో పంచుకున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరో, ఆ దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పటికీ తెలియరాలేదు. ఏ సంస్థ ఈ ఘటనకు ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు.

360 F 254175402 blMrnFi5tf6pzftAsJ69FmJk0w6XHWkj

బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌

ఇదిలా ఉండగా, బలూచిస్థాన్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. గత వారం కూడా అక్కడి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ప్రయాణిస్తున్న వాహనంపై పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బలూచిస్తాన్ సమస్య

బలూచిస్తాన్ అనేది పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్. ఇది భూభాగ పరంగా దేశంలో 44% వంతు ఆక్రమించుకున్నా, జనాభా తక్కువ. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా, బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే కారణంగా దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో అసంతృప్తి, తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి.

చారిత్రక నేపథ్యం:

1947లో విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది.అయితే, 1948లో పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని అనుసంధానం చేసుకుంది.అప్పటి నుంచి బలూచ్ ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైంది.పాకిస్థాన్ సైన్యం బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని బలూచ్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

భద్రతా సిబ్బంది

ఈ ఘాతుక ఘటన పంజాబ్, బలూచిస్థాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేపింది. ముఖ్యంగా ప్రయాణికులు తమ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. పంజాబ్, బలూచిస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870