పహల్గాంలో ఉగ్రదాడితో 26మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్‘ పేరుతో యుద్ధం చేసింది. ఈ యుద్ధం ప్రధానంగా పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలనే లక్ష్యంగా చేసుకుంది. భారత్ దాడిలో పలు ఉగ్రసంస్థల శిబిరాలను ధ్వంసం చేసింది. పలువురు ఉగ్రవాదులు సైతం ఆ దాడిలో మరణించారు. మసూద్ అజర్ కుటుంబంలో అయితే ఏకంగా పదిమంది మరణించారు. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమండర్ ఖాసిమ్ (Qasim)స్పందించారు. తమ స్థావరాలపై భారత్ దాడులు చేసిందని అంగీకరించారు. ‘మురిద్కేలో ఉన్న మా ప్రధాన కార్యాలయం భారత్ చేసిన దాడుల్లో ధ్వంసమయింది. ఈ కార్యాలయాన్ని గతంలో కంటే మళ్లీ భారీగా నిర్మిస్తామని’ వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్ ఇంతకాలం తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని ఆరోపిస్తూ వచ్చిందిఅవన్నీ అసత్యాలే అని తేలిపోయింది.

పాకిస్తానీ యువత ఉగ్రశిక్షణలో భాగం కావాలి
ధ్వంసమైన కార్యాలయంలో చాలామంది ముజాహిద్దీన్(Mujahideen) (ఉగ్రవాదులు) ట్రైనింగ్ తీసుకున్నారని పేర్కొన్నారు. పాకిస్తానీ యువత ఇక్కడ ఉగ్రశిక్షణ (దౌరా ఇసుఫా)లో భాగం కావాలన్నారు. ఇందులో మతం, జిహాదీపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు . ఇక మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైపుల్లా కసూరీ కూడా మాట్లాడుతూ పాక్ ప్రభుత్వం, సైన్యం తమకు ఉగ్రస్థావరాలను పునర్నిన్మించేందుకు నిధులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆపరేషన్ సిందూర్లో ధ్వంసం చేసినటువంటి 9 ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్ కూడా ఒకటి ఉన్నట్లు తెలిపారు.
కశ్మీర్ లో సంఘీభావ దినోత్సవంపై కూడా ఫోకస్ పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అప్పటికల్లా మురిద్కేలో ఉగ్ర కాంప్లెక్స్ ను మళ్లీ నిర్మించి సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మించబోయే భవనమే మళ్లీ ఉగ్రశిక్షణ, ఆపరేషనల్ ప్లానింగ్ కు కేంద్రంగా ఉండనుంది. ఇదిలా ఉండగా ఇటీవల జైషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో మసూద్ అజర్ కుటుంబం ముక్కలైందని పేర్కొన్నారు.
పహల్గామ్ దాడి ఎక్కడ జరిగింది?
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
ఈ దాడిపై పాకిస్తాన్ ఏ విధంగా స్పందించింది?
పాకిస్తాన్ అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ తప్పుడు ఆరోపణలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: