నిత్యం ఉగ్రవాద సంస్థలకు సహకారాన్ని అందిస్తూ, దేశ ప్రజల జీవనవిధానాన్ని పట్టించుకోకుండా పొరుగురాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్న పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. దీనిపై పెరుగుతున్న నిరుద్యోగంపై ఆ దేశ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యత కాదని, ఆ పని పూర్తిగా ప్రైవేటు రంగమే చూసుకోవాలని పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబు (Muhammad_Aurangzeb) స్పష్టం చేశారు. తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులు, ఉద్యోగాల కొరతతో సతమతమవుతున్న దేశంలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో నిరుద్యోగం రేటు 7.1శాతానికి చేరింది.
Read also: Car Blast: రష్యాలో కారు బ్లాస్ట్.. లెఫ్టినెంట్ మృతి.. మళ్లీ టెన్షన్

Pakistan
పేదరికం, అల్పాదాయం పెరిగిపోవడంతో
అధికారిక లెక్కల ప్రకారమే దేశంలోని 7.72 కోట్ల కార్మిక శక్తిలో 80లక్షల మందికి పైగా ఉ
ద్యోగాలు లేకుండా ఉన్నారు. పేదరికం, అల్పాదాయం పెరిగిపోవడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఉద్యోగ కల్పనకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన ప్రభుత్వమే బాధ్యత నుంచి తప్పుకోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
నిధులు లేని దుస్థితితో విలవిల.. గడిచిన ఆరేళ్లుగా పాకిస్థాన్ పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం, తయారీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 706 బిలియన్ల నుంచి 2025 నాటికి రూ.377 బిలియన్లకు, అంటే ఏకంగా 46శాతం పడిపోయాయి.
విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండటం
కొత్తపెట్టుబడులు రాకపోగా, ఉన్న యంత్రాలను ఆధునికీకరించేందుకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొంది. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ లో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండటం కూడా పోటీతత్వాన్ని దెబ్బతీస్తోంది. ఉద్యోగాలను నేరుగా సృష్టించకపోయినా, వాటి కల్పనకు అవసరమైన స్థిరమైన విధానాలు, చౌక రుణాలు, నిరంతరాయ ఇంధన సరఫరా, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: