📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్తాన్ యుద్ధంపై పాక్ వీడియో రిలీజ్..!

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న సాయాన్ని ఇప్పటికే ఆ దేశ మంత్రి అంగీకరించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పలు చర్యల్ని ప్రకటించిన భారత్.. ఇవాళ మరోసారి కీలక చర్యలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ప్రధాని మోడీ ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై పరిమిత సైనిక దాడి చేసేందుకు భారత్ సిద్దమవుతుందా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అదే సమయంలో యుద్ధ నివారణకు ఐక్యరాజ్యసమితి కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు భారత విదేశాంగమంత్రి జై శంకర్ తో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కూడా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ కాల్ చేశారు. తాజా పరిస్ధితులపై వీరిద్దరితో చర్చించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.

నిఘా వర్గాల హెచ్చరిక
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ చేసిన కాల్ లో ఆయన భారత్ తమపై సైనిక దాడికి సిద్దమవుతుందంటూ తెలిపారు. ఈ మేరకు తమపై భారత్ సైనిక దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఐరాసను అలర్ట్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రధాని మోడీ ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది.
రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్య
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ వైఫల్యం నుండి దృష్టిని మళ్లించేందుకు ఆ దేశ సమాచార , ప్రసారాల సమాఖ్య మంత్రి అతావుల్లా తరార్ ఎక్స్ లో ఓ వీడియో పోస్టు పెట్టారు. ఇందులో పహల్గామ్ సంఘటనలో ప్రమేయం ఉందని నిరాధారమైన , కల్పిత ఆరోపణల సాకుతో భారతదేశం రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్య చేపట్టాలని యోచిస్తోందని పాకిస్తాన్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు. దీనిపై తాము తగు విధంగా స్పందిస్తామంటూ సుదీర్ధ పోస్టు పెట్టారు.

Read Also: India Pakistan War: పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Pakistan pakistan war Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news video release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.