📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Pakistan Terrorism: వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ (pakistan) తన సొంతదేశంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది. సొంత ప్రజలను ఉగ్రవాదులు హతమారుస్తున్నా, దాడులకు పూనుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. అంతేకాక పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పోషిస్తూ, పొరుగుదేశాలపై ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్నది. ప్రస్తుతం ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీపీటీ) మరింతగా బలాన్ని పుంజుకుంటున్నది. కొత్తఏడాదిలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగానే పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు చేసింది. అయితే ఈ వార్త పాక్ అధికారులను కలవరపెడుతునననది.

Read also: Bangladesh politics : తారిక్ రెహ్మాన్ స్పీచ్‌లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?

Pakistan Terrorism

వచ్చే ఏడాదిలో వైమానిక దళం

2026లో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని టీటీపీ ఓ ప్రకటనలో తెలిపింది. సలీం హక్కానీ నాయకత్వంలో దీన్ని నడపనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రావిన్స్ ల వారీగా మోహరింపులు, మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కశ్మీర్, గిల్గిత్, బాల్టిస్థాన్ తో సహా మరి కొన్ని ప్రావిన్స్ లను తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రణాళిక చేస్తోంది. మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది. ఖైబర్ పఖుంశ్వా, బలోచిస్థాన్ ప్రావిన్స్ లలో కార్యకలాపాలు విస్తరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Pakistan Terrorism Tehrik-e-Taliban Telugu News ttp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.